Перейти к содержимому

కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం | అష్టవిధ నాయికల వర్ణన | Janardanashtakam | Rudrakavi | Rajan PTSK

Ajagava

0:00 / 0:00

కందుకూరి రుద్రకవి జనార్దనాష్టకం | అష్టవిధ నాయికల వర్ణన | Janardanashtakam | Rudrakavi | Rajan PTSK

23 326 просмотров · 1 год назад
Ajagava
189 тыс. подписчиков
23 326 просмотров · 1 год назад
అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం మన తెలుగు భాషలో వ్రాయబడ్డ మొట్ట మొదటి అష్టకమైన జనార్దనాష్టకం గురించి చెప్పుకుందాం. సుమారు 500 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ జనార్దనాష్టకం శృంగార రస ప్రధానమైనది. అయితే అసభ్యతకు, అశ్లీలతకు తావులేకుండా చాలా సరసంగా ఉంటుంది. ఎంతో లయబద్ధంగా ఉండే ఈ పద్యాలు.. చదివే కొద్దీ చదవాలనిపిస్తాయి. ఈ జనార్దనాష్టకాన్ని రచించిన కవి కందుకూరి రుద్రకవి. ఈ రుద్రకవి సామాన్యుడు కాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకడు. తెలుగులో వచ్చిన మొట్టమొదటి యక్షగానమైన సుగ్రీవ విజయాన్ని కూడా ఈ కవే రచించాడు. అలానే నిరంకుశోపాఖ్యానమనే కావ్యం కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ఈ రుద్రకవి ఇప్పటి నెల్లూరు జిల్లాలోని కందుకూరు అనే గ్రామానికి చెందినవాడు. ఆ గ్రామంలో జనార్దనస్వామి ఆలయం ఉంది. చారిత్రక పరిశోధకుల లెక్కల ప్రకారం ఆ ఆలయం ఇప్పటికి సుమారు 800 సంవత్సరాల క్రితమే కట్టబడింది. ఆ ఆలయంలో కొలువైన జనార్దనస్వామే ఈ అష్టకంలో కథానాయకుడు. జనార్దనుడు అంటే శ్రీకృష్ణుడే. ఆయన శృంగార నాయకుడు. అందులోనూ దక్షిణ నాయకుడు. దక్షిణ నాయకుడు అంటే ఆ నాయకుడికి అనేకమంది భార్యలు, లేదా ప్రియురాళ్ళుంటారు. అయితే వారందరినీ కూడా తన ప్రేమలో మునకలేయించగలిగితేనే అతను దక్షిణ నాయకుడవుతాడు. ఈ దక్షిణ నాయకుల్లో శ్రీకృష్ణుణ్ణి మించినవారు లేరు. ఇక ఈ అష్టకంలో నాయిక - ఒక గోపిక. స్వామి వారి భార్యలలో ఒకతె. ఆ స్వామికి భార్యలందరూ ప్రియురాళ్ళే కదా. నిజానికి ఏ భార్యైనా తన భర్త తనకు మాత్రమే సొంతమని అనుకోవడం సహజం. కానీ ఎందరో భార్యలున్న ఆ గోపాలకృష్ణుడు ఈ ఒక్క భామ దగ్గరే ఉండిపోవడం కుదిరేపని కాదు కదా! అందువల్ల కృష్ణుడు తనతో ఉన్నప్పుడు పొంగిపోయే ఆ నాయిక, అతను మరో భామ దగ్గర ఉన్నాడని తెలిసినప్పుడు కోపంతో ఊగిపోతుంది. అతగాడు వేరే దేశం వెళ్లినప్పుడు విరహంతో కాగిపోతుంది, మళ్ళా దగ్గరకు వస్తే అతని కౌగిట్లో వాలిపోతుంది. ఇలా సందర్భానుసారంగా ఆ నాయిక అష్టవిధ శృంగార నాయికల అవస్థలన్నీ అనుభవిస్తుంది. అలా అష్టవిధ నాయికలందరినీ తనలోనే ఇముడ్చుకున్న ఆ భామామణి యొక్క కోపతాపాలను, సరసవిరసాలను పది పద్యాలలో ఎంతో పొందికగా, ముద్దుమాటల అల్లికగా ఈ అష్టకం రచించాడు రుద్రకవి. ఈ అష్టకంలో చమత్కారం ఏంటంటే.. ఆ భామామణి కృష్ణుణ్ణి జనార్దనా అని కాకుండా కందుకూరి జనార్దనా అని ఊరి పేరుతో సహా పిలుస్తుంటుంది. ఆ స్వామి సామాన్యుడు కాడు కదా. అనేక అవతారాలెత్తి ఎందరో రాక్షసుల్ని సంహరించినవాడు. అందుకే దనుజమర్దనా అన్న విశేషణం కూడా ఆ పిలుపుకు జతకలిసింది. అలా “దనుజమర్దన కందుకూరి జనార్దనా” అన్న మాటలు ఈ అష్టకంలోని పది పద్యాలకు మకుటమయ్యాయి. ఇక ఇప్పుడు మనం ఆ అష్టకంలోని ఒక్కో పద్యన్నీ చెప్పుకుంటూ ఆ నాయిక పడే అవస్థలను కూడా చూసొద్దాం.