Перейти к содержимому

🚨 పిఠాపురం నియోజికవర్గంలో అభివృద్ధి పండుగ | Pithapuram MLA On Duty | Nagababu | Kanna Janasena

The Kanna Reports

0:00 / 0:00

🚨 పిఠాపురం నియోజికవర్గంలో అభివృద్ధి పండుగ | Pithapuram MLA On Duty | Nagababu | Kanna Janasena

27 397 просмотров · 1 год назад
The Kanna Reports
345 тыс. подписчиков
27 397 просмотров · 1 год назад
పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు సీసీ రోడ్ల కోసం రూ. 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ. 10.85 కోట్లు ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం రూ. 8 కోట్లు ఇప్పటికే 16 కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శాసన సభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ. 40 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభించిన శ్రీ నాగబాబు గారు శనివారం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీసీ రోడ్ల కోసం రూ.22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ.10.85 కోట్లు కేటాయించగా ఇప్పటికే 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇవి కాకుండా ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ. 8 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రారంభించిన రోడ్ల వివరాలు.. పిఠాపురం నియోజకవర్గంలో రూ. 3.70 కోట్ల ఖర్చుతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను శనివారం ప్రారంభించగా అందులో పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో రూ. 15.70 లక్షల వ్యయంతో మూడు సీసీ రోడ్లు, విరవ గ్రామంలో రూ. 75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో రూ. 29.65 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్న జగ్గంపేట గ్రామంలో రూ. 28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, యు.కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో రూ. 38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో రూ. 11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గానూ రూ. 1.52 కోట్ల వ్యయంతో, మొత్తం రూ. 3.70 కోట్ల రూపాయలు ఖర్చుతో రోడ్లను నిర్మించడం జరిగిందని అన్నారు. రికార్డు స్థాయిలో సామాజిక పెన్షన్ల పంపిణీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రికార్డు స్థాయిలో 39.441 మందికి సామాజిక పెన్షన్లు ప్రతీ నెల రూ. 16.81 కోట్లు అందించడం జరుగుతోందని శ్రీ నాగబాబు గారు స్పష్టం చేశారు. దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 70,328 మందికి దాదాపుగా రూ. 5.84 కోట్ల వ్యయంతో గ్యాస్ సిలిండర్ లు అందజేయడం జరుగుతోందని అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 59.70 కోట్లు మంజూరు చేసి, పాలనాపరమైన అనుమతి లభించడం ఆనందదాయకమని చెప్పారు. సామర్లకోట – ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులువు అయ్యి ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గొల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రూ. 88.98 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించినట్లు శ్రీ నాగబాబు తెలిపారు. ఈ ఆసుపత్రిలో సుమారు 23,146 మంది ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందుతాయని, 10 పడకల్ సామర్థ్యంతో, 60 రకాల ల్యాబ్ పరీక్షలు, 172 రకాల మందులు, టిబి, కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుందని వెల్లడించారు. గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయం గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చొరవతో రూ. 60 లక్షల వ్యయంతో తహసిల్దార్ కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించినట్లు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోనే ఉండడం వలన ప్రజా సేవల పరిధి మెరుగుపడి, ప్రజా వినతి దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు #pithapuram #pawankalyan #kannajanasena